యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్య క్షేత్రంలో శుక్రవారం స్వాతి నక్షత్ర పూజల కోలహలం నెలకొంది. తెల్ల వారు జాము 4గంటల నుంచి ఐదున్నర వరకు గిరిప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు. ఆలయంలో మూడున్నర గంటల పాటు శ్రీవారి అష్టోత్తర శతఘటాభిషేకం కనులపండువగా నిర్వహించారు.
బాలాలయంలో ప్రతిష్టామూర్తులకు నిజాభిషేకం మొదలుకుని తులసీ అర్చన వరకు నిత్య పూజలు జరిపారు. ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. హారతి నివేద నలు అర్పించారు.
సుదర్శన నారసింహ హోమం ద్వారా శ్రీవారిని కొలిచి, సదుర్శన ఆళ్వారులను కొలుస్తూ హోమం జరిపారు. ప్రతీ రోజు నిర్వహించే నిత్య తిరుకల్యాణోత్సవంలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల కల్యాణ వేడుకను వీక్షించారు. దేవేరులను ముస్తాబు చేసి గజ వాహనంపై ముఖ మండపంలోనే ఊరేగించారు.
శ్రీలక్ష్మీ సమేతు డైన నారసింహుడిని ఆరాధిస్తూ సుమారు గంటన్నరకు పైగా కల్యాణ తంతు జరిపారు. ఆలయంలో దర్శనం అనంతరం రూ.100 చెల్లించి అతి తక్కువ సమయంలో జరుపుకునే అష్టోత్తర పూజల్లో భక్తులు పాల్గొని మొక్కు లు తీర్చుకున్నారు. పాతగుట్ట లక్ష్మీనారసింహుడి సన్నిధిలో నిత్యపూజలు శాస్ర్తోక్తంగా జరిగాయి.