యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధనీ సమేత రామలింగేశ్వరస్వామి వారి బాలాలయంలో అక్టోబర్ 7వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి) నుంచి 15వ తేదీ (ఆశ్వీయుజ శుద్ధ దశమి దసరా ) వరకు శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో ఎన్. గీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
9 రోజుల పాటు నవరాత్రి పూజల్లో పాల్గొనే దంపతులు రూ. 1,116, నవరాత్రిలో ఒక్కరోజు సప్తశతి పారాయణం చేయు టకు రూ. 116, లక్ష కుంకుమార్చన రూ. 116 చెల్లించాలని తెలిపారు. భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజల్లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.