యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం ఆదివారం రాత్రి కన్నులపండువగా జరిగింది. స్వామివారి దివ్య బాలాలయ ఉత్సవ మండపంలో ఈ వేడుకను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. కాగా ఉదయం 11 గంటలకు వివిధ పుష్పాలతో స్వామివారిని జగన్మోహినీ అలంకారంలో పెండ్లి కుమారుడిగా ముస్తాబు చేసి తిరువీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో ఎన్ గీత, అనువంశిక ధర్మకర్త బీ నరసింహమూర్తి, ప్రధానార్చకులు నల్లంథిగల్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
నేడు కల్యాణమహోత్సవం..
బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి తిరు కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు బాలాలయంలో, రాత్రి 7.30 గంటలకు కొండకింద పాత జెడ్పీహెచ్ఎస్ మైదానంలో కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. – యాదాద్రి