యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రంలో క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ అర్చకు లు ప్రత్యేక పూజలు చేపట్టారు. యాదాద్రి క్షేత్రానికి పాలకుడిగా విష్ణు పుష్కరిణి, పాతగుట్టలో కొలువుదీరిన హనుమంతు డిని సింధూరంతో అలంకరించి పంచామృతాలతో అభిషేకించారు.
ఆంజనేయుడికి కొలుస్తూ అర్చకులు వేదమంత్రాలను పఠించారు. వివిధ రకాల పూలమాలలతో అలంకరించి సహస్రనామ పఠనాలతో తమలపాకుల అర్చన చేపట్టారు. ఆంజనేయస్వామి వారికి ఇష్టమైన వడపప్పు, బెల్లం, అరటి పండ్లను నైవే ధ్యంగా సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.