గుండాల, మార్చి 24: మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకం లో తేది:01/08/2018 నుంచి 31/12/2020 వరకు జరిగిన పనులకు గాను బుధవారం ప్రజావేదిక నిర్వహిం చారు. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో జ రిగిన ఉపాధి పనులకు సంబంధించిన అంశాలను డీఆర్డీవో మందడి ఉపేందర్రెడ్డి, ఏపీడీ మాదవిలు పరిశీలించారు. మండలంలోని 8 గ్రామాల నివేదికలు పూర్తి కాగా మిగిలిన 12 గ్రామాలకు చెందిన నివేదికలను గురువారానికి వాయి దా వేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ విజిలెన్స్ అధికారి ఆది త్య, ఎస్టీఎం అజయ్, ఎంపీడీవో వీరస్వామి, ఎంపీవో జ నార్దన్రెడ్డి, ఏపీవోలు ఇమాన్యుయేల్, నర్సయ్య, కరుణా కర్, ఈసీలు వినోద్కుమార్, మోహన్, టీఏలు, పంచాయి తీ కార్యదర్శులు, ఉపాధిహామి సిబ్బంది తదితరులు పాల్గొ న్నారు.