టంగుటూరు నుంచి 400 మంది టీఆర్ఎస్లో చేరిక
ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత సంక్షేమ బడ్జెట్కు ఆకర్షితులయ్యారు
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి
ఆలేరు టౌన్, మార్చి 22 : సీఎం కేసీఆర్ దళితుల సంక్షేమా నికి పెద్దపీట వేస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మ హేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆలేరులోని పద్మావతి గార్డెన్లో సో మవారం టంగుటూరు గ్రామానికి చెందిన వివిధ పార్టీల నా యకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ వర్గాల అభ్యున్నతే ధ్యేయం గా రూ. వెయ్యి కోట్లతో దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంకు ప్ర భుత్వం రూపకల్పన చేసిందన్నారు. షెడ్యూల్డ్ కులాల సర్వ తోముఖాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నూతన పథకాన్ని రూ పొందించారని కొనియాడారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశ పెట్టి న బడ్జెట్ దళిత సంక్షేమ బడ్జెట్ అని అన్నారు.
ఎస్సీలకు ప్రత్యేక ప్రగతి నిధి కోసం రూ. 21,306.85కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. అలాగే సీఎం చేపడుతున్న సంక్షేమ పథ కాలకు ఆకర్షితులై టంగుటూరు గ్రామం నుంచి సుమారు 400 మంది టీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు. వారందరికీ తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామంలో దళితులు పెద్ద సంఖ్యలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఏ రా ష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని దీనంతటికీ సీఎం కేసీఆర్ కృషియేనని కొనియాడారు. టంగుటూరు గ్రామంలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అం తకుముందు రైల్వేగేట్ నుంచి పద్మావతి గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, టంగుటూరు ఎంపీటీసీ అనురాధ, మండల, పట్ట ణ టీఆర్ఎస్ ప్రెసిడెంట్లు శ్రీనివాస్, వెంకటేశ్, నాయకులు, ప్రజా ప్రతినిధు లు నాగరాజు, మల్లేశం, పరమేశ్వర్, రామన్న, వెంకట్రెడ్డి, వెంకటేశ్, ఐలమ్మ, రామరుషి, మాజీ ఎంపీపీ అనసూయ, కేశ వులు, రామన్, పాండరి తదితరులు పాల్గొన్నారు.