లండన్ : ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టును సిరీస్ ప్రారంభానికి ముందే కరోనా మహమ్మారి వణికిస్తున్నది. వికెట్ కీపర్ రిషబ్ పంత్తో పాటు స్టాఫ్మెంబర్ దయానంద్ గరణి వైరస్కు పాజిటివ్గా పరీక్షించిన విషయం తెలిసిందే. వీరితో సన్నిహితంగా ముగ్గురు ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇందులో వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్తో పాటు స్టాండ్బై ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ ఉన్నారు. వీరికి పరీక్షలు నిర్వహించగా ముగ్గురికీ నెగెటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇంగ్లండ్ ప్రభుత్వ ఆరోగ్య భద్రతా ప్రోటోకాల్ మేరకు ఐదుగురూ లండన్లోనే ఐసోలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ నెల 20 నుంచి జరిగే ప్రాక్టీస్ మ్యాచ్కు పంత్, సాహా దూరమయ్యారు. అయితే, వీరంతా మళ్లీ 20 రోజుల తర్వాత వీరంతా జట్టుతో కలువనున్నారు.