న్యూఢిల్లీ : ఛత్రసల్ స్టేడియంలో రెజ్లర్ సాగర్ ధంకర్ హత్య కేసులో అరెస్టయిన ఒలింపిక్ పతక విజేత సుశీల్కుమార్ మండోలి జైలు నుంచి తీహార్ జైలుకు తరలించారు. సుశీల్కుమార్తో పాటు అతని సహచరుడు అజయ్ను మే 23న ఢిల్లీ స్పెషల్ పోలీసుల బృందం దేశ రాజధానిలోని ముండ్కా ప్రాంతంలో అరెస్టు చేశారు. అయితే, భద్రతా కారణాలతో సుశీల్ తిహార్ జైలు-2కు తరలించినట్లు తెలుస్తోంది. కాగా, జైలు అధికారులు మాత్రం సాధారణ ప్రక్రియని పేర్కొన్నారు. ఢిల్లీ ఛత్రసాల్ స్టేడియం వద్ద మే 4న సాగర్తో పాటు అతని స్నేహితులు సోను, అమిత్కుమార్పై సుశీల్కుమార్.. స్నేహితులతో కలిసి దాడి చేసినట్లు ఆరోపణలున్నాయి. తీవ్ర గాయాలు కావడంతో సాగర్ మృతి చెందిన విషయం తెలిసిందే. దాడి అనంతరం పరారీలో ఉన్న రెజర్ల్తో పాటు సహ నిందితుడు అజయ్కుమార్ను అరెస్టు చేశారు. బెయిల్ కోసం దరఖాస్తు చేయగా కోర్టు తిరస్కరించింది. ఇదే కేసులో సుశీల్ జూడో కోచ్ను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.