టెహ్రాన్: ‘ప్రపంచంలోనే అత్యంత మురికి మనిషి’గా పిలిచే ఇరాన్కి చెందిన అమౌ హజీ అనే వ్యక్తి మరణించాడు. 94 ఏండ్ల హజీ ఐదు దశాబ్దాలుగా స్నానం చేయలేదు. ఇరాన్లో ఫార్స్ ప్రావిన్స్లోని దేగ్జాహ్ గ్రామం లో అమౌ హజీ ఆదివారం మరణించాడని స్థానిక మీడియా పేర్కొన్నది.
అనారోగ్యం బారిన పడుతాననే భయంతో హజీ స్నానాన్ని నిరాకరించేవాడని అధికారులు చెబుతున్నారు. అయితే గ్రామస్తులు ఇటీవల ఓసారి అతనికి బలవంతంగా స్నానం చేయించారు.