పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)లో ఉత్తేజం నెలకొంది. గోవా ఫార్వర్డ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ ఖండోల్కర్ శనివారం టీఎంసీలో చేరారు. వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు రాబట్టి కాషాయ పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని ప్రణాళికలు రూపొందిస్తున్న టీఎంసీకి కిరణ్ ఖండోల్కర్ చేరిక ఊతమిస్తోంది.
ఈ పరిణామం టీఎంసీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. మరోవైపు గోవా పోరులో సత్తా చాటేందుకు స్వయంగా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దీదీ ఇటీవల గోవాలో పర్యటించి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.