పాన్గల్, మే 21 : ఇంటింటికీ స్వచ్ఛమైన, సురక్షితమైన, శుద్ధిచేసిన తాగునీటిని నల్లాల ద్వారా సరఫరా చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్భగీరథ పథకం ఫలించింది. గత ప్రభుత్వాల హయాంలో ఎండాకాలం వచ్చిందంటే తాగునీటికి అష్టకష్టాలు పడాల్సివచ్చేది. ప్రజల దాహార్తి తీర్చేందుకు గ్రామ గ్రామానా ట్యాంక ర్ల ద్వారా తాగునీరు సరఫరా చేసే పరిస్థితి ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇ ప్పుడా పరిస్థితి లేదు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన శుద్ధజలం సరఫరా చేస్తున్నారు. నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
గ్రామాల్లో ఒక్కొక్కరికీ రోజుకూ 100లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్ర భుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్భగీరథ పథకం ద్వా రా పల్లెల్లో తాగునీటి సమస్యలు తలెత్తడం లేదని ప్రజలు హ ర్షం వ్యక్తం చేస్తున్నారు. పాన్గల్ మండలంలో 47,072 మంది జనాభా ఉన్నది. ఆయా గ్రామాల్లో తాగునీటి అవసరాల నిమిత్తం ప్రభుత్వం 39 ఏహెచ్ఆర్ ట్యాంకులు నిర్మించింది. ట్యాంక్ల ద్వారా మండలంలోని 39 గ్రామాల్లో 131 కిలోమీటర్ల చొప్పున పైప్లైన్ పనులు చేపట్టాల్సి ఉండగా 130కిలోమీటర్ల వరకు పైప్లైన్ నిర్మాణాలు పూర్తి చేసుకొని ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందిస్తున్నారు. అదేవిధం గా ఇంటింటికీ 12,002 మిషన్భగీరథ నల్లా కనెక్షన్లు పూర్తయ్యాయి. ప్రజల చెంతకే స్వచ్ఛమైన తాగునీరు అందించడంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఆయా గ్రామాల ప్రజలు ప్ర భుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
తాగునీటి సమస్య తీరింది..
మా గ్రామంలో రెండు, మూడేండ్ల కిందటి వరకు తాగునీటికి ఇబ్బంది పడ్డాం. కిలోమీటర్ల దూరం వెళ్లి వాహనాల ద్వారా నీళ్లు తెచ్చుకునేవాళ్లం. లేదంటే ట్రాక్టర్ల ద్వారా ప్రభుత్వం సరఫరా చేసే నీళ్లు తాగేవాళ్లం. ఇప్పుడు మిషన్భగీరథ నీళ్లు వస్తుండడంతో తాగునీటి సమస్య తీరింది. ప్రతిరోజూ ఉదయం రెండు గంటలపాటు నీళ్లొస్తున్నాయి.
– చింతకాయల రాముడు, కేతేపల్లి
ప్రభుత్వానికి కృతజ్ఞతలు..
మా గ్రామంలో సురక్షితమైన తాగునీరు అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞత లు. కలుషితమైన తాగునీరు వల్లే సగం రోగాలు వస్తున్నాయని గుర్తించిన సీ ఎం కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన తాగునీరు అందిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో తాగునీటికి అరిగోస పడ్డాం. ఇప్పుడా పరిస్థితిలేదు. ఒక్కొక్కరికీ 100లీటర్ల చొప్పున మిషన్భగీరథ నీరు అందిస్తున్నారు. తాగునీటికి ఇబ్బంది పడడం లేదు.
– ఎం శ్రీధర్రెడ్డి, ఎంపీపీ, పాన్గల్
వందశాతం సరఫరా అవుతున్నది..
ప్రతి గ్రామంలో పైప్లైన్ పనులు పూర్తయి దాదాపు వందశాతం ఇండ్లకు మిషన్భగీరథ నల్లాల ద్వారా నీటి సరఫరా అవుతుంది. ప్రధానంగా ఎండాకాలంలో ప్రజలకు నీటికొరత లేకుండా చూస్తున్నాం. ఎప్పటికప్పుడు లీకేజీలు లేకుండా చేపడుతున్నాం. గ్రామాల్లో సమస్యలుంటే మా దృష్టికి తీసుకొస్తే వీలైనంత త్వరలో పరిష్కరిస్తాం.
– నాగేశ్వర్రెడ్డి, ఎంపీడీవో, పాన్గల్