ఇల్లందకుంట : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన మహిళలు బుధవారం చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై మహిళలు పెద్ద ఎత్తున టీఆర్ఎస్లో చేరినట్టు తెలిపారు. ప్రజా సంక్షేమమే ఎజెండాగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆయన అన్నారు.