భోపాల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మధ్యప్రదేశ్ మహిళా కానిస్టేబుల్కు అరుదైన గౌరవం లభించింది. కానిస్టేబుల్ మీనాక్షి వర్మ ఒక రోజు హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తన చైర్ను ఓ రోజు పాటు కానిస్టేబుల్ మీనాక్షి వర్మకు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. మరోవైపు మధ్యప్రదేశ్ ప్రభుత్వం మతమార్పుడులను వ్యతిరేకిస్తూ చేసిన చట్టానికి ఇవాళ అసెంబ్లీలో ఆమోదం దక్కింది.