బెంగళూరు: బిల్కిస్ బానోపై లైంగిక దాడి చేసిన వారిని తిరిగి జైల్లో వేయాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రంలో సంతకాల సేకరణ చేపట్టారు. 2002 గుజరాత్ అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో ఇంట్లో చొరబడి ఆమెపై లైంగికదాడి చేసిన 11 మందిని గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల రెమిషన్పై విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, దోషులను జైలుకు పంపాలనే డిమాండ్తో కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో 40 వేల మంది నుంచి సంతకాల సేకరణ నిర్వహించారు.
ఈ పిటిషన్ను పోస్ట్ ద్వారా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్కు పంపించారు. ఈ విషయంపై అన్ని వర్గాల నుంచి స్పందన వచ్చేలా కాలినడకన తిరుగుతూ ప్రజల నుంచి సంతకాల సేకరణ చేశారు. బిల్కిస్ బానోపై లైంగికదాడికి పాల్పడిన 11 మంది దోషుల రెమిషన్ను రద్దు చేసి జైలుకు పంపడమే తమ లక్ష్యమని ఆల్ ఇండియా మహిళా సాంస్కృతిక్ సంఘటన్ సభ్యురాలు శోభ తెలిపారు.