అమరావతి : జీవిత భాగస్వామి కోసం మ్యాట్రిమోనిని ఆశ్రయించి మోసపోయిన మహిళ ఉదంతం ఏపీలోని నరసరావుపేటలో చోటు చేసుకుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరసరావుపేటకు చెందిన మహిళ నకిలీ మ్యాట్రిమోని వెబ్సైట్లో పేరు నమోదు చేసుకుంది. ఈ వెబ్సైట్ను ఫాలో అవుతున్న శ్రీకాంత్ అనే వ్యక్తి ఆన్లైన్లో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.
కొద్దిరోజుల తరువాత వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. అమెరికాలో ఉంటానని నమ్మించి అక్కడికే రావాలని మహిళను నమ్మించాడు. అందుకు వీసా పంపడానికి డబ్బు పంపాలని కోరగా విడతల వారిగా ఆమె నింది తుడు శ్రీకాంత్ బ్యాంక్ అకౌంట్లోకి రూ. 48 లక్షలు పంపింది. అనంతరం అతడి నుంచి ఎలాంటి సమాచా రం రాకపోవడం, ఫొన్ స్వీచ్ఛాఫ్ వస్తుండడంతో మోసానికి గురైనట్లు గ్రహించి నరసరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి నిందితుడి ఫొన్ నంబర్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు ప్రారంభించగా నిందితుడు విజయవాడకు చెందిన వంశీకృష్ణగా గుర్తించారు.
అతడు మ్యాట్రిమోనిలో ఫొటో, పేరు మార్చి మోసానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గతంలో ప్రకాశం జిల్లాలోనూ ఇదే మాదిరిగా నిందితుడు మోసానికి పాల్పడి అరెస్టు అయిన్నట్లు గుర్తించి అతగాడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.