డెహ్రాడూన్: భారీ లోడ్తో వెళ్తున్న ఒక లారీ అదుపు తప్పి టోల్ బూత్లోకి దూసుకెళ్లింది. అక్కడ ఉన్న మహిళ వెంటనే అప్రమత్తమై టోల్ బూత్ సిబ్బందిని రక్షించింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో శనివారం ఈ సంఘటన జరిగింది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ దీనికి సంబంధించిన ఒక వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. భారీ లోడ్తో ఉన్న ఒక లారీ టోల్ బూత్లోని ఒక కేబిన్పైకి దూసుకెళ్లింది. అనంతరం అక్కడ బోల్తా పడింది.
కాగా, ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక మహిళ వెంటనే స్పందించింది. ధ్వంసమైన టోల్ బూత్ కేబిన్ వద్దకు పరుగున వెళ్లింది. అందులోని మహిళా సిబ్బందిని లాక్కొని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లింది. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ను ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ తన ట్విట్టర్లో ఆదివారం పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా దీనిని చూశారు.
మరోవైపు ధైర్యం చేసి టోల్ బూత్ సిబ్బందిని కాపాడిన ఆ మహిళ చొరవ, సాహసాన్ని నెటిజన్లు ప్రశంసించారు. అలాగే టోల్ బూత్ కేబిన్ ముందు రక్షణగా ఇనుప కమ్మీలను ఏర్పాటు చేయడాన్ని కొందరు అభినందించారు. దీని వల్ల కేబిన్లోని సిబ్బందికి ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు.
ध्यान से देखें. देहरादून के टोल प्लाजा दुर्घटना में एक युवती ने अपनी जान की परवाह किये बगैर बूथ के अंदर मौजूद कर्मी को दौड़कर बचाया. pic.twitter.com/qZmn5BJZwu
— Awanish Sharan (@AwanishSharan) July 24, 2022