తనతో తానే పెండ్లి చేసుకుంటానంటూ ఇటీవల వార్తల్లోకెక్కిన గుజరాత్ యువతి క్షమా బిందు పెండ్లి జరిగింది. అయితే ముందుగా చెప్పినట్టు ఓ గుడిలో జూన్ 11న చేసుకుంటానంటూ ప్రకటించినా.. మూడు రోజుల ముం దుగానే బుధవారం తన ఇంట్లోనే తనును తానే వివాహం చేసుకున్నది.
బీజేపీ, రైట్ వింగ్ కార్యకర్తల నుంచి ఈ పెండ్లిపై తీవ్ర వ్యతిరేకత రావడం, పెండ్లి జరుగకుండా చూస్తామంటూ బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లోనే పెండ్లి చేసుకున్నట్టు తెలిపింది.