న్యూఢిల్లీ : నయవంచనకు మారుపేరుగా మారిన టెకీ ప్రియురాలి ప్రాణాలను బలిగొన్నాడు. పెండ్లి పేరుతో మహిళ (33)కు దగ్గరైన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆమె గర్భం దాల్చడంతో ఏకంగా 14 సార్లు అబార్షన్ చేయించాడు. సాకులు చెబుతూ పెండ్లి చేసుకునేందుకు నిందితుడు నిరాకరిస్తుండటంతో మరో దారిలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడింది.
జులై 5న ఢిల్లీలోని జత్పూర్ ప్రాంతంలో ప్రియుడి మోసాన్ని తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు తెలిపారు. పెండ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నమ్మక ద్రోహం చేశాడని ఘటనా స్ధలంలో లభించిన సూసైడ్ నోట్లో బాధితురాలు వెల్లడించింది.
పెండ్లి చేసుకునేందుకు నిరాకరించడంతో వేరే దారిలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. మహిళను ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు గత ఏడెనిమిదేండ్లుగా భర్త నుంచి మహిళ వేరుగా ఉంటోందని దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెప్పారు.