డర్బన్: దక్షిణాఫ్రికాకు చెందిన ఉయోల్వేతు సిమానైల్ అనే మహిళ కోడి కాళ్లు తినడంలో ప్రపంచ రికార్డు సృష్టించింది. కేవలం ఒకే నిమిషంలో ఆమె మూడున్నర కోడి కాళ్లు (మూడు కాళ్లు పూర్తిగా, మరో కాలు సగం) తినడం ద్వారా గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకుంది. స్టంబో రికార్డు బ్రేకర్స్ అనే ఎపిసోడ్లో భాగంగా సిమానైల్తోపాటు మరో ముగ్గురు మహిళలు కోడి కాళ్లు తినే పోటీలో పాల్గొన్నారు.
ఈ పోటీలో సిమానైల్ కేవలం ఒక్క నిమిషంలో మూడున్నర కోడి కాళ్లను స్వాహా చేసి ఔరా అనిపించింది. మిగతా ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా ఆమె తిన్నదాంట్లో సగం కూడా తినలేకపోవడం గమనార్హం. డర్బన్లోని ఉమ్లాజీ ఏరియాలోగల మషాంప్లేన్స్ లాంజ్ రెస్టారెంట్ అండ్ బార్లో ఈ పోటీని నిర్వహించారు. ఈ పోటీలో కాంపిటీటర్స్కు ఇచ్చిన ఒక్కో కోడి కాలు 35 గ్రాముల బరువు ఉందట.
అంటే సిమానైల్ నిమిషంలో దాదాపు 120 గ్రాముల కోడి కాళ్లు తిన్నదన్నమాట. నిమిషంలో 120 కోడి మాంసం తినడం ఈజీనే. కానీ 120 గ్రాముల కోడి కాళ్లు (నాలుగు వేళ్లతో ఉండే పాదాలు) తినడం మాత్రం అంత ఈజీ కాదు. కాలులోని ప్రతి వేలులో దృఢమైన ఎముకలు ఉంటాయి. కాబట్టి వాటిని కొరకకుండా అమాంతం మింగడం సాధ్యపడదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది కాబట్టే సిమానైల్ రికార్డుల్లోకి ఎక్కింది.