టాటా ఏస్, బైక్ ఢీ కొన్న ప్రమాదంలో భార్య మృతి
భర్తకు తీవ్ర గాయాలు
మంథని మున్సిపల్ పరిధిలోని కూచీరాజ్పల్లి వద్ద ఘటన
మంథని టౌన్, జూన్ 19: శుభకార్యానికి వెళ్లివస్తున్న మహిళ అనంతలోకాలకు చేరింది. అనుకోని ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఆదివారం రాత్రి మంథని మున్సిపల్ పరిధిలోని కూచీరాజ్పల్లి వద్ద జరిగిన ఘటన రచ్చపల్లిలో విషాదం నింపింది. మంథని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మంథని మండలం రచ్చపల్లి గ్రామానికి చెందిన రవి, భార్య ముక్కెర లక్ష్మి (48)తో కలిసి ఆదివారం ఉదయం ద్విచక్రవాహనంపై బిట్టుపల్లిలోని ఆర్అండ్ఆర్ కాలనీలోని బంధువుల గృహప్రవేశానికి వెళ్లారు. కార్యక్రమం ముగిసిన అనంతరం స్వగ్రామానికి తిరిగివస్తున్నారు.
మంథని మండలం కూచీరాజ్పల్లి వద్ద పెద్దపల్లి నుంచి మంథని వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్పై నుంచి ఎగిరిపడడంతో లక్ష్మి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించింది. రవికి తీవ్రగాయాలు కాగా చికిత్స కోసం కరీంనగర్ దవాఖానకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ వెంకటేశ్వర్లు పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.