హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని సన్సిటీ వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని దవాఖానకు తరలించారు. మృతురాలిని నాగిరెడ్డిగూడానికి చెందిన అనితగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.