హైదరాబాద్ : డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్పై బాధిత యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్లోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తున్న ఎం సంధ్యారాణి గతంలో ముగ్గురిని వివాహమాడి విడాకులు ఇచ్చింది. ఇద్దరికి విడాకులు ఇవ్వగా, ఒకరు ఆమె వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
తాజాగా షాబాద్ మండలం హైతబాద్కు చెందిన వ్యక్తిని ట్రాప్ చేసింది. ఉద్యోగం చేసుకుంటున్న అతన్ని ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నది. పెళ్లి చేసుకోకపోతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడుతానని, కలిసి దిగిన ఫోటోలు బయటపెడుతానని బెదిరించింది. మొత్తానికి అతడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత మహిళా కానిస్టేబుల్ నుంచి అతనికి వేధింపులు ఎక్కువ అయ్యాయి. దీంతో చేసేదేమీ లేక తనను ఆమె నుంచి రక్షించండి అంటూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీసులకు ఆన్లైన్ ద్వారా బాధితుడు ఫిర్యాదు చేశాడు.