హైదరాబాద్ : నగరంలోని పేట్బషీరాబాద్లో ఓ మహిళ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం ఈ విషాధ సంఘటన చోటుచేసుకుంది. స్వాతిరెడ్డి(28), సుబ్బారెడ్డి ఇరువురు దంపతులు. పేట్బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని పద్మానగర్ కాలనీలో గల సాయి ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం మహిళ బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకింది.
తీవ్రగాయాల కారణంగా మహిళ మృతిచెందిందని సబ్ ఇన్స్పెక్టర్ కె.మల్సూర్ తెలిపారు. మహిళ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. స్వాతి గతకొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంది. అందుకు చికిత్స తీసుకుంటుంది. కాగా తన ఆరోగ్యంపై ఆలోచిస్తూ కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్లోకి వెళ్లిందన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.