చెన్నై : యువతి(20)పై ఆమె స్నేహితుడు సహా ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆపై రోడ్డు మీద విడిచిపెట్టి వెళ్లిన ఉదంతం తమిళనాడులోని చెంగల్పట్లో శనివారం రాత్రి వెలుగుచూసింది. యువతి వేలూరులో నర్సు పోస్టు కోసం ఇంటర్వ్యూకు వెళుతుండగా ఈ ఘటన జరిగింది.
ఇంటర్వ్యూకు హాజరయ్యేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి ఆమె బస్టాప్లో ఉండగా శరవణన్ అనే స్నేహితుడు డిన్నర్ చేద్దామని ఆహ్వానించి తన కారులోఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో శరవణన్ తన స్నేహితులు సారధి, సూర్యప్రకాష్లను పికప్ చేసుకున్నాడు.
ఆపై యువతిని వారు నిర్జన ప్రదేశంలోకి తీసుకువెళ్లి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను అర్ధరాత్రి వేళ నడిరోడ్డుపై విడిచివెళ్లారు. బాధితురాలు మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుని ఆత్మహత్యా యత్నం చేయగా కుటుంబ సభ్యులు వారించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తు ముమ్మరం చేశారు.