అనిల్ రావిపూడి.. తెలుగు ఆడియన్స్ కు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. రాజమౌళి, కొరటాల శివ తర్వాత వరస విజయాలతో దూసుకుపోతున్న సెన్సేషనల్ డైరెక్టర్ ఈయన. ఇప్పటి వరకు చేసిన ప్రతి సినిమాతో నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలు తీసుకొచ్చాడు ఈయన. అందుకే ఇప్పుడు అనిల్ సినిమా అంటే హాట్ కేక్. ప్రస్తుతం ఈయన క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. వరస సినిమాలకు కమిట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఎఫ్ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. హైదరాబాద్లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాతో పాటు గాలి సంపత్ అనే మరో సినిమాను కూడా తీసుకొస్తున్నాడు అనిల్. దీనికి దర్శకుడు కాకపోయినా అన్నీ తానే అయి చేశాడు అనిల్. ఈ సినిమాతో తన స్నేహితుడు కృష్ణ నిర్మాతగా పరిచయం అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఎఫ్ 3 తర్వాత వరసగా సినిమాలు కమిట్ అవుతున్నాడు అనిల్. ఈయన కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు.
ఒక్కో సినిమా కోసం దాదాపు రూ.14 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడు అనిల్ రావిపూడి. తాజాగా ఈయన హైదరాబాద్లోనే ఓ కాస్ట్ లీ ఏరియాలో రూ.12 కోట్లు పెట్టి విల్లా కూడా తీసుకున్నాడు అనిల్. ఎఫ్ 3 తర్వాత వరసగా మూడు సినిమాలు లైన్ లోనే ఉన్నాయంటున్నాడు అనిల్. అయితే అందులో ఏ ఒక్కటి కూడా కన్ఫర్మ్ కాలేదు. రామ్ హీరోగా ఎప్పట్నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాడు అనిల్. కానీ కుదర్లేదు.. ఈయన కందిరీగ సినిమాకు రైటర్గా పని చేశాడు అనిల్. అందుకే అప్పట్నుంచి రామ్ హీరోగా సినిమా చేయాలనుకుంటున్నాడు. మరోవైపు మహేష్ బాబుతో మరో సినిమా కూడా ఉంది.
ఓ సారి కలిసి మాట్లాడుకున్న తర్వాత ఈ సినిమాపై క్లారిటీ వస్తుందని చెప్పాడు అనిల్ రావిపూడి. ఇక బాలయ్య సినిమా కూడా అలాగే ఉంది. చాలా ఏళ్ళుగా ఈ సినిమా అలాగే లైన్ లో ఉంది. కానీ కాంబినేషన్ సెట్ కావడం లేదు. దిల్ రాజు నిర్మాతగా అప్పట్లో ఓ సినిమా ప్లాన్ చేశాడు. అనివార్య కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. అయితే బాలయ్యతో సినిమా మాత్రం ఇంకా అలాగే ఉందని.. ఎప్పటికి సెట్ అవుతుందో చెప్పలేమని అంటున్నాడు అనిల్. ఏదేమైనా కూడా టాలీవుడ్లో ముగ్గురు అగ్ర హీరోలతో సినిమాలను క్యూలో పెట్టాడు అనిల్ రావిపూడి.