‘తగ్గేదేలె…’ అంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో విజయం దక్కింది. తొలి భాగం ఇచ్చిన విజయంతో ‘పుష్ప 2’ పై అంచనాలు పెరిగాయి. ఇటీవలే ఈ సినిమాను ఉత్సాహంగా ప్రారంభించారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుతున్నారు.
రష్మికతో పాటు ఈ చిత్రంలో సాయిపల్లవి ఓ కీలక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి మరో తాజా వార్త బయటకొచ్చింది. సినిమా విడుదల తేదీ విషయంలో చిత్ర బృందం ఒక స్పష్టతకు వచ్చారు. వచ్చే ఏడాది వేసవికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ రిలీజ్ టార్గెట్గా పెట్టుకుని మూవీ టీమ్ పనిచేస్తున్నదని చెబుతున్నారు.