హాజీపూర్ : ప్రజల చే ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు సరైన గౌరవం దక్కడం లేదని స్వయాన నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శాసనమండలిలో చేసిన ప్రసంగానికి బుద్దిపల్లి గ్రామ పంచాయతీ స్పందించింది. పంచాయతీ పాలకవర్గం సభ్యులు చర్చించి కార్యాలయంలో ప్రత్యేకంగా చాంబర్ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అన్నం మధుసూదన్ రెడ్డి తన సొంత ఖర్చులతో చాంబర్ ఏర్పాటు చేసి టేబుల్, కుర్చీని ఏర్పాటు చేసి సన్మానించి స్వీట్ తినిపించారు.
ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల శాసన మండలిలో ఎంపీటీసీల గురించి మాట్లాడటంతో ఆలోచించి ఎంపీటీసీకి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ వెంకటేశ్ సర్పంచ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాధ, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.