కుర్సియాంగ్ (పశ్చిమబెంగాల్): బీఎస్ఎఫ్ అధికార పరిధిని విస్తరించడంపై పశ్చిమబెంగాల్ సీఎం మమతాబెనర్జీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం చర్య సామాన్య ప్రజలను వేధించేలా ఉన్నదని విమర్శించారు. మంగళవారం ఆమె అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ ‘రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు లేవు. ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు. అయినా కేంద్రం అంతర్జాతీయ సరిహద్దు నుంచి 50 కిలోమీటర్ల వరకు బీఎస్ఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టేలా, అరెస్టులు చేసేలా అధికారం కల్పించింది. ఇది సామాన్య ప్రజలను వేధించడమే’ అని పేర్కొన్నారు. కేంద్రం చర్య వెనుక దురుద్దేశం ఉన్నదని ఆరోపించారు.