న్యూఢిల్లీ : ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు విస్డెన్ తమ అభిమాన టీమిండియా జట్టు ప్లేయింగ్ ఎలెవన్ను ఎంపిక చేసింది. విరాట్ కోహ్లీ నాయకత్వంలో భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్తో జూన్ 18 నుంచి ఈ ఫైనల్ మ్యాచ్ ఆడవలసి ఉంది. విస్డెన్ తన జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు , ఇద్దరు స్పిన్నర్లను చేర్చుకోగా.. సీనియర్ మోస్ట్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మకు తన జట్టులో స్థానం ఇవ్వలేదు. అలాగే, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్పై బాగా రాణించిన వాషింగ్టన్ సుందర్, అక్సర్ పటేల్ సహా చాలా మంది యువ ఆటగాళ్లను కూడా దూరంగా ఉంచింది.
డబ్ల్యూటీసీ ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ను విస్డెన్ ఎంపిక చేసింది. చేతేశ్వర్ పుజారా మూడో నంబర్ కోసం జట్టులో ఉండగా.. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగవ స్థానంలో ఉన్నాడు. జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె ఐదో స్థానంలో, వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ ఆరవ స్థానంలో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాను ఆల్ రౌండర్లుగా చేర్చి, బౌలింగ్ విభాగంలో సిరాజ్కు ప్రాధాన్యత ఇచ్చింది. సిరాజ్ తర్వాతనే షమీ, బుమ్రాలను జట్టులో చేర్చుకున్నది.
రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చేతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (డబ్ల్యూకే), రవీంద్ర జడేజా, అశ్విన్, సిరాజ్, షమీ, జస్ప్రీత్ బుమ్రా
రుతుపవనాల ప్రభావం : శ్రీలంక జలమయం, 14 మంది మృతి
నీట్, జేఈఈ మెయిన్స్ : వచ్చే వారం షెడ్యూల్ విడుదల..!
జెరూసలేంలో అల్ జజీరా మహిళా జర్నలిస్ట్ అరెస్ట్
WWDC 2021: రేపటి నుంచి ఆపిల్ ఈవెంట్ ప్రారంభం
ఇమ్రాన్ మాట : భారత్తో చర్చలకు సిద్ధమే, కానీ..
ఆఫ్ఘాన్లో బాంబు పేలుడు : 11 మంది దుర్మరణం
అదే స్వరం : కొవిడ్కు చైనాదే బాధ్యత అన్న ట్రంప్
భాషా వివాదం : ఈ దవాఖానలో మలయాళంలో మాట్లాడొద్దు..
చరిత్రలో ఈరోజు.. భాగమతి నదిలో రైలు దుర్ఘటనకు 40 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..