న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మరో వారం రోజులు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ నెల 31వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగుతుందని ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో కొవిడ్ పాజిటివిటీ రేటు 2.5శాతానికి తగ్గిందని చెప్పారు. 24 గంటల్లో కొత్తగా 1,600 కరోనా కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. కొవిడ్ కేసులు తగ్గుముఖం పడితే నెలాఖరు నుంచి అన్లాక్ ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి టీకాలు వేస్తేనే థర్డ్ వేవ్ను ఎదుర్కొనే అవకాశం ఉందని, అందరికీ వీలైనంత త్వరగా టీకాలు వేసేందుకు యోచిస్తున్నట్లు పేర్కొన్నారు. టీకాలకు సంబంధించి దేశీయ, విదేశీ సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. ఇదిలా ఉండగా.. పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఏప్రిల్ 19న ఢిల్లీలో లాక్డౌన్ ప్రకటించగా.. పలుసార్లు పొడగిస్తూ వచ్చారు. చివరి సారిగా ఈ నెల 16న పొడగించారు. ఈ నెల 24న ఉదయం 5 గంటలతో గడువు ముగియనున్న నేపథ్యంలో మరో వారం రోజులు పొడగించారు.