ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
కుత్బుల్లాపూర్, మార్చి 26 : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శనివారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సప్తగిరి ఎన్క్లేవ్లో ఆయన పర్యటించి.. సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాల నీలో భూగర్భడ్రైనేజీ, సీసీరోడ్లు, మంచినీటి పైపులైన్, విద్యుత్ స్తంభాల ఏర్పాటును పరిశీలించారు. కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుం డా చర్యలు తీసుంటానని హామీ ఇచ్చారు. ప్రపంచ నీటి దినోత్సవాన్ని పురస్కరించుకొని నీటిని వృథా చేయకుండా.. ప్రతి ఒక్కరూ నీటిని పొదుపు చేయాలని పిలుపునిచ్చారు. ఈఈ కృష్ణచైతన్య, వాటర్ వర్క్స్ డీజీఎం రాజేశ్, ఏఈలు సురేందర్నాయక్, భానుచందర్, కాలనీ వాసులు పాల్గొన్నారు.
హనుమాన్ ఆలయంలో పూజలు
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి నాగులూరు గ్రామంలో జరుగుతున్న శివ పంచాయతనం, నవగ్రహ హనుమాన్ ధ్వజస్తంభం, బొడ్రాయి, ఊరడమ్మ, లింగమయ్య దేవతల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్యాదవ్, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీపీ చినంగి వెంకటేశం, స్థానిక వైస్ చైర్మన్ తుడుం పద్మారావు పాల్గొన్నారు.