రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనం పెంచాలి
వివిధ శాఖలతో ఎమ్మెల్యే పైళ్ల సమీక్ష
కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి విస్తరణ
పనుల పరిశీలన
భువనగిరి కలెక్టరేట్, జూన్ 4 : పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో శనివారం ఆయన కలెక్టర్తో కలిసి ఫారెస్టు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు అవసమైన చర్యలు తీసుకోవాలని, ఈ పనులు ఎప్పటికీ శాశ్వతంగా ఉండిపోతాయని పేర్కొన్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు కృషి చేయాలన్నా రు. అనంతరం భువనగిరి మున్సిపాలిటీలో రోడ్డు వెడల్పు పనులను కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ప్రజా ప్రతినిధుల తో కలిసి పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఐదో వార్డు కౌన్సిలర్ ఏ.కిరణ్, ఆర్డీఓ భూపాల్రెడ్డి, తాసీల్దార్ వెంకట్రెడ్డి, కమిషనర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే ఆదర్శం
వలిగొండ : గ్రామాల అభివృద్ధిలో రాష్ట్రం దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. మండలంలోని గుర్నాథ్పల్లి, చిత్తాపురం, గోపరాజుపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేశ్రాజ్, సర్పంచులు ఏనుగు అంజిరెడ్డి, కీసర్ల ఉపేంద్రాసత్తిరెడ్డి, జువ్వి మం జుల, ఎంపీటీసీలు సామ రాంరెడ్డి, నీలం లలిత, పీఏసీఎస్ చైర్మన్లు సుర్కంటి వెంకట్రెడ్డి, చిట్టెడి వెంకట్రాంరెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ పనుమటి మమతానరేందర్రెడ్డి, మొగుళ్ల శ్రీనివాస్, తుమ్మల వెంకట్రెడ్డి, వాకిటి అనంతరెడ్డి, లింగస్వామి, ఎంపీడీఓ గీతారెడ్డి, పీఆర్ఏఈ సుగుణాకర్రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.