హైదరాబాద్ : భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన వైనం. ఈ దారుణ సంఘటన నగరంలోని వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గగన్ అగర్వాల్(38) అనే వ్యక్తి కనిపించడం లేదని పేర్కొంటూ భార్య నౌసిన్ బేగం, గగన్ సోదరుడు గడిచిన ఫిబ్రవరి 8న ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గగన్ అగర్వాల్ రెండేళ్లక్రితం మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. గడిచిన జూన్లో నౌసిన్ బేగంను వివాహం చేసుకున్నాడు. విచారణలో గగన్ అగర్వాల్ హత్యకు గురైనట్లు పోలీసులు కనుగొన్నారు. భార్య నౌసిన్ బేగమే హత్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టినట్లుగా పేర్కొన్నారు. నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.