మహబూబాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దంతాలపల్లి మండలంలోని పెద్దముప్పారం గ్రామంలో మృత్యువులోనూ భార్యాభర్తలు కలిసే ప్రయాణం చేశారు. గ్రామానికి చెందిన అలువాల రామయ్య(90) భార్య చెన్నమ్మ(80) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం మధ్యాహ్నం మృతి చెందింది. దీంతో కుమిలిపోయిన భర్త సాయంత్రం మృతి చెందాడు. వృద్ధ దంపతుల మృతదేహాలను చేసి గ్రామస్తులు కంటతడి పెట్టారు. కాగా, ఆ దంపతులకు సంతానం లేకపోవడంతో బంధువులు, గ్రామస్తులు వారికి దహన సంస్కారాలు నిర్వహించారు.