హైదరాబాద్ : గతవారం నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి కార్మికనగర్లో చోటుచేసుకున్న టైలర్ హత్య కేసులో పోలీసులు మంగళవారం ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితులను సయీద్ మహహ్మద్ అలీ(22), మృతుడి భార్య రూబీనా(25)గా గుర్తించారు. కేసు వివరాలను డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ వెల్లడించారు. సిద్ధిఖీ, రూబీనా భార్యభర్తలు. కాగా రూబీనా గత రెండేళ్లుగా సయీద్తో స్నేహంలో ఉంది.
ఓసారి ఇంట్లోనే భార్యను అలీతో పాటు పట్టుకున్న సిద్ధిఖీ.. అలీని చితకబాదాడు. దీంతో సిద్ధిఖీపై అలీ కోపం పెంచుకున్నాడు. పథకంలో భాగంగానే రూబీనా మార్చి 28న తన పుట్టింటికి వెళ్లింది. రూబీనా ఇచ్చిన సమాచారంతో అలీ మార్చి 30వ తేదీ రాత్రి సిద్ధిఖీ ఇంటికి వెళ్లాడు. స్క్రూ డైవర్ సహాయంతో ఇనుప చువ్వల కిటీకిని తొలగించి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లోకి ప్రవేశించడంతో ఓ ఐరన్ రాడ్తో సిద్ధికి బలంగా కొట్టి చంపాడు.
అనంతరం మృతదేహాన్ని ఫ్రిడ్జ్లో కుక్కి అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జూబ్లీహాల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లభించిన ఆధారాల మేరకు మహహ్మద్ అలీని అదుపులోకి తీసుకుని విచారించగా హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. అలీతో పాటు రూబీనాను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.