భారత్తో జరుగుతున్న రెండో టీ20లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని వెస్టిండీస్ సారధి నికోలస్ పూరన్ చెప్పాడు. గత మ్యాచ్ చేదు అనుభవాన్ని మర్చిపోయి, కొత్తగా ఈ మ్యాచ్ ఆరంభిస్తామని తెలిపాడు. అలాగే తమ జట్టులో బ్రూక్స్, పాల్ ఆడటం లేదని, వారి స్థానంలో కింగ్, థామస్ ఆడుతున్నారని వెల్లడించాడు. అలాగే తమ జట్టులో ఒక మార్పు ఉందని భారత సారధి రోహిత్ చెప్పాడు. రవి బిష్ణోయి స్థానంలో ఆవేష్ ఖాన్ ఆడుతున్నట్లు తెలిపాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, దినేష్ కార్తీక్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, ఆవేష్ ఖాన్, అర్షదీప్ సింగ్
A look at our Playing XI for the 2nd T20I 👇
Live – https://t.co/C7ggEOTWOe #WIvIND pic.twitter.com/56upsFo89m
— BCCI (@BCCI) August 1, 2022