వెస్టిండీస్తో జరుగుతున్న ఐదో టీ20లో భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. చాలా రోజుల తర్వాత జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్న ఇషాన్ కిషన్ (11) నిరాశ పరిచాడు. రోహిత్, సూర్యకుమార్ గైర్హాజరీలో శ్రేయాస్ అయ్యర్తో కలిసి ఓపెనింగ్ చేసిన ఇషాన్.. 13 బంతులు ఎదుర్కొని కేవలం 11 పరుగులు మాత్రమే చెయ్యగలిగాడు.
ఒక పక్క శ్రేయాస్ ధాటిగా ఆడుతున్నప్పటికీ కిషన్ మాత్రం తడబడ్డాడు. ఐదో ఓవర్లో డ్రేక్స్ వేసిన బంతిని పుల్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే టైమింగ్ మిస్ అవడంతో పూరన్కు సులభమైన క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు. దీంతో టీమిండియా 38 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది.