న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అత్యవసర వినియోగం కింద ఆమోదం దక్కుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ఓ రిపోర్టర్ వేసిన ప్రశ్నకు బదులిస్తూ ఆమె ఈ సమాధానం ఇచ్చారు. కోవాగ్జిన్ టీకాకు ఇంకా డబ్ల్యూహెచ్వో అనుమతి దక్కని విషయం తెలిసిందే. అయితే ట్రయల్స్కు సంబంధించిన డేటాను ఆ కంపెనీ రెండు నెలల క్రితమే ప్రపంచ ఆరోగ్య సంస్థకు సమర్పించింది. డేటాను పరిశీలిస్తున్న డబ్ల్యూహెచ్వో.. ఈ నెలలో కోవాగ్జిన్కు అత్యవసర అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.