న్యూఢిల్లీ : ఇటీవల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 44 సెకన్లకు ఓ వ్యక్తి కొవిడ్తో మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేసన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో కీణత కొనసాగుతోందని.. కానీ, ఈ ధోరణి కొనసాగుందనే గ్యారంటీ లేదన్నారు. ఫిబ్రవరి నుంచి మరణాల సంఖ్య 80శాతానికిపైగా తగ్గిందని, గత వారంలో 44 సెకన్లకు ఒకరు కొవిడ్తో మరణించారని బ్రీఫింగ్లో తెలిపారు. ఆ మరణాల్లో చాలా వరకు నివారించదగినవన్నారు.
మహమ్మారి ఇంకా ముగియలేదని నేను చెప్పడం విని మీరు విసిగిపోయి ఉండవచ్చని, ఈ వైరస్ అంతరించిపోదని ఇప్పటి వరకు చెప్పానని.. ఇంకా చెబుతూనే ఉంటానన్నారు. ఇదిలా ఉండగా.. గత 24గంటల్లో దేశంలో కొత్తగా 5,076 కొవిడ్ కేసులు నమోదవగా.. ప్రస్తుతం 47వేలకుపైగా యాక్టివ్ కేసులున్నాయి. మంకీపాక్స్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ స్పందిస్తూ ఐరోపాలో మంకీపాక్స్ తిరోగమనంలో ఉందన్న ఆయన.. గత వారం అమెరికాలో కేసుల పెరుగుదల క్షీణించినా.. ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్పై తీర్మానాలు చేయడం కష్టమన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 52,997 మంది మంకీపాక్స్ బారినపడ్డారు. గతనాలుగు వారాల్లో నమోదైన కేసుల్లో 70.7శాతం అమెరికా నుంచి, 28.3శాతం యూరప్ నుంచే ఉన్నాయి.