హైదరాబాద్ : శాసనసభకు సాధారణంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. వీరిద్దరూ సభలో లేనప్పుడు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆ సమయంలో అధ్యక్షత వహించే వారిని ఏ పేరుతో పిలుస్తారు? వారిని ఏ అర్హత ఆధారంగా నియమిస్తారు? అనేది చూద్దాం.
ప్యానెల్ స్పీకర్ల గురించి రాజ్యాంగంలో ఎక్కడా పొందుపరచలేదు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు సభలో లేనప్పుడు అధ్యక్షుడిగా ఉండేందుకు నియమించే తాత్కాలిక స్పీకర్లనే ప్యానెల్ స్పీకర్లు అంటారు. సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ప్యానెల్ స్పీకర్లను నియమిస్తారు.
సీనియర్ సభ్యులను శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్లుగా నియమిస్తారు. ఆ మాదిరిగానే ప్యానెల్ స్పీకర్ల నియామకం ఉంటుంది. సీనియర్ సభ్యులైన ఒకరు నుంచి నలుగురిని ప్యానెల్ స్పీకర్లుగా నియామకం చేస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సభలో లేనప్పుడు సభకు ప్యానెల్ స్పీకర్లు అధ్యక్షత వహిస్తారు. తెలంగాణలో అసెంబ్లీలో ప్యానెల్ స్పీకర్లుగా సీనియర్ సభ్యులు రెడ్యా నాయక్, హన్మంత్ షిండే, ముంతాజ్ అహ్మద్ ఖాన్ను నియమించారు. గత రెండు రోజుల నుంచి అప్పుడప్పుడు సభలో హన్మంత్ షిండే ప్యానెల్ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు.