హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా బాలల హక్కుల రక్షణ కోసం కేంద్రం తీసుకొంటున్న చర్యలేమిటని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా బాలసదనాల్లోని చిన్నారులపై దాడులు జరుగుతున్నాయని, సంరక్షించాల్సిన సిబ్బందే వారిపట్ల అనుచితంగా ప్రవరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. దీనికి కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి స్మృతి ఇరానీ సమాధానం చెప్తూ.. బాలల హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నాయని, వాటికి లోబడి చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఎన్సీపీసీఆర్ (ది నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) జేజేయాక్ట్ (జువైనల్ జస్టిస్ యాక్ట్)లను అనుసరించి చర్యలు తీసుకొంటామని చెప్పారు.
రాష్ట్రంలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణాల పరిస్థితి ఏమిటని కేంద్రాన్ని ఎంపీ బీబీ పాటిల్ ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సమాధానం చెప్తూ.. రాష్ట్రంలో 9 వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, మరో 6 పురోగతిలో ఉన్నాయని తెలిపారు.