‘క్రాక్’ ‘నాంది’ చిత్రాల్లో విలక్షణ అభినయంతో తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించింది వరలక్ష్మి శరత్కుమార్. ఆమె కథానాయికగా హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కాంచన కోనేరు నిర్మాత. డార్లింగ్ స్వామి దర్శకుడు. వరలక్ష్మి శరత్కుమార్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం సినిమా తాలూకు కొత్త పోస్టర్ను విడుదలచేశారు. వరలక్ష్మి శరత్కుమార్ ముఖంతో పాటు చీకటితో నిండిన ఓ ఇంటితో కూడిన పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు మాట్లాడుతూ ‘హారర్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమిది. ఓ ఇంటి నేపథ్యంలో ఊహకందని మలుపులతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. వరలక్ష్మి పాత్ర శక్తివంతంగా సాగుతుంది. గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఆమె కనిపిస్తుంది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: కోనేరు సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ కొడాలి, కథ, మాటలు, దర్శకత్వం: డార్లింగ్ స్వామి.