తండ్రి జన్మ నక్షత్రంలో కొడుకు, తల్లి జన్మ నక్షత్రంలో కూతురు పుడితే దోషమా?
– ప్రసూన, మెదక్
ఏకస్మన్నేవ నక్షత్రే భ్రాత్రోర్వా పితృ పుత్రయోః
ప్రసూతిశ్చేత్తయోర్మృత్యు ర్భవేదేకస్య నిశ్చితః॥
తండ్రి పుట్టిన నక్షత్రంలో కొడుకు గానీ, తల్లి పుట్టిన నక్షత్రంలో కూతురు గానీ పుడితే దోషమని ధర్మశాస్త్రం చెబుతుంది. అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఆ దోషానికి పరిహారం కూడా ధర్మశాస్త్రంలో ఉంది. తల్లిదండ్రుల నక్షత్రాల్లో పిల్లలు కలిగితే అందుకు పరిహారంగా ‘గోముఖ ప్రసవం’ అనే శాంతిని చేయాలని సూచించింది. ‘పిత్రేక నక్షత్రోత్పత్తి సూచిత సర్వారిష్ట పరిహార ద్వారా…’ అని సంకల్పాన్ని చెప్పి, కలశంపై ఎర్రని వస్త్రాన్ని ఉంచుతారు. దానిపై ఆ జన్మనక్షత్ర ప్రతిమనుగానీ, నక్షత్ర దేవతా ప్రతిమను గాని ఉంచి జన్మ నక్షత్ర శాంతి చేస్తారు. తర్వాత గోవును పూజిస్తారు. గోమాత నుంచి శిశువును స్వీకరిస్తారు. ఈ ప్రక్రియను ‘గోముఖ ప్రసవం’ అని పిలుస్తారు.
డా॥ శాస్త్రుల రఘుపతి, 73867 58370
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
పెండ్లిళ్లు, శుభకార్యాల సమయంలో కంకణం ఎందుకు కడతారు?
ధర్మ సందేహం… పిండం కాకి తినకపోతే ఏమౌతుంది?
ఆది శంకరాచార్యులు సన్యాసం స్వీకరించేందుకు తల్లిని ఎలా ఒప్పించాడో తెలుసా?