హుజూరాబాద్ రూరల్, హుజూరాబాద్ నియోజవర్గ ప్రజలు అరుసార్లు ఈటల రాజేందర్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, సీఎం కేసీఅర్ రెండు సార్లు మంత్రి పదవి ఇస్తే నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ది చేయలేదని ప్రభుత్వ విప్, అచ్చపేట ఎమ్మె ల్యే గువ్వల బాలరాజు అన్నారు. గురువారం మండలంలోని తుమ్మనపల్లి గ్రామంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ తన కూతురు వివాహ మహోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో భాగంగా బాలరాజు హాజరయ్యాడు.
ఈ సందర్బంగా బాలరాజు మాట్లాడుతూ సీఎం కేసీఅర్ ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం అందజేస్తున్నాడని గుర్తు చేశాడు. ఐదేండ్లు పరిపాలించమని ఈటల రాజేందర్కు ఓటు వేస్తే మధ్యలోనే అవినీతి అరోపణలు ఎదుర్కొని తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఓట్లడుగుతున్నాడని పేర్కొన్నారు. ఉద్యమ బిడ్డ, తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కేసుల్లో ఇరుక్కున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ను అశీర్వదించి ఓటు వేస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాడని అన్నారు.
మీరంత నా కుటుంబసభ్యులే : హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్కుమార్
తుమ్మనపల్లి గ్రామస్థులంతా తన కుటుంబ సభ్యులని, మీ వెంటనే మా కుటుంబం ఉంటుందని ఒడితల సతీష్కుమార్ అన్నారు. తన కూతురు వివాహాం కరోనా సమయంలో జరిగిందని, ఎవ్వరినీ అహ్వానించలేక పోయానన్నారు. కాబట్టే ఈ రోజు మీతో గడపాలని వచ్చినట్లు తెలిపారు. మన మధ్య ఎలాంటి అపోహాలు ఉండవద్దని, తాతల తండ్రుల నుంచి ఎలా కలిసి ఉన్నామో ఎప్పటికీ అలాగే ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమానికి హజరైన రాష్ట్ర అర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డిలు మహిళలకు వడ్డించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడూరి ప్రతాప్రెడ్డి, ఉప సర్పంచ్ రాజిరెడ్డి, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఏనుగు సత్యనారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ యాళ్ల శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ యువ నాయకులు నొడితల ప్రణవ్బాబు, ఇంద్రనీల్, సింగిల్ విండో డైరెక్టర్లు సామల సుదాకర్రెడ్డి, భగవాన్రెడ్డి, నాయకులు రాజేశ్వర్రెడ్డి, చిరంజీవరెడ్డి, గుంటేటి దేవేందర్రెడ్డి, బద్దం నవీన్, అరవింద్తో పాటుతదితరులు ఉన్నారు.