క్రికెట్ లెజెండ్స్లో టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ ఒకడు. అతని వికెట్ తీసుకోవడాన్ని చాలా మంది బౌలర్లు గొప్ప ఫీట్గా భావిస్తారు. అలాంటిది ఈసారి ఐపీఎల్14లో ధోనీని రెండుసార్లు అవుట్ చేశాడు యువపేసర్ ఆవేశ్ ఖాన్. ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ పేసర్ తన సత్తాతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఈ ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో రెండో స్థానంలో నిలిచాడు.
ఐపీఎల్ తొలి ఫేజ్లో ధోనీని డకౌట్ చేసిన ఈ బౌలర్.. యూఏఈలో జరుగుతున్న రెండో ఫేజ్లో కూడా ధోనీని ఒకసారి పెవిలియన్ పంపాడు. అయితే ఈ ధోనీని ఇలా అవుట్ చేయడంలో ఢిల్లీ జట్టు సారధి రిషభ్ పంత్ తెలివితేటలు చాలా ఉన్నాయని ఆవేశ్ ఖాన్ వెల్లడించాడు. తొలిసారి ధోనీని డకౌట్ చేసిన సమయం గురించి వివరించాడు.
‘‘మహీభాయ్ బ్యాటింగ్కు రాగానే మిడాన్, మిడాఫ్ ఫీల్డర్లను 30 యార్డ్ సర్కిల్లోపలకు తీసుకురావాలని పంత్ చెప్పాడు. వాళ్లపై నుంచి ధోనీ షాట్లు కొడితే కొట్టనీ అన్నాడు. అయితే ఫుల్ లెంగ్త్లో బంతులేయద్దని చెప్పాడు. నేను దానికి ఒప్పుకోలేదు. సర్కిల్ లోపలకు ఐదుగురు ఫీల్డర్లను తీసుకురావొద్దని చెప్పా. కానీ పంత్ వినలేదు. ఆ తర్వాత నేను వేసిన రెండో బంతినే ఆ ఫీల్డర్ల పైనుంచి బాదడానికి ధోనీ ప్రయత్నించాడు. అలా అతని వికెట్ దక్కింది’’ అని ఆవేశ్ వెల్లడించాడు.
ఆ తర్వాత యూఏఈలో కూడా ఒకసారి ధోనీ వికెట్ కూల్చిన ఆవేశ్.. అప్పుడు కూడా పంత్ ప్లాన్ ఉందన్నాడు. ‘‘అప్పుడు కూడా పంత్తో మాట్లాడా. అతను ఒకటే చెప్పాడు. హార్డ్ లెంగ్త్లో బంతులేయమన్నాడు. ఆ బంతులు ఆడటం కష్టం కాబట్టి ధోనీ షాట్లు ఆడినా పర్లేదని చెప్పాడు. అలా చేస్తే బంతి ఎడ్జ్ తీసుకోవడంతో వికెట్ దక్కింది’’ అని తన కెప్టెన్ ప్లాన్ను వివరంగా చెప్పాడు. బుధవారం నాడు కోల్కతా నైట్ రైడర్స్తో ఢిల్లీ జట్టు రెండో క్వాలిఫైయర్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే ఫైనల్లో మరోసారి చెన్నైను ఢీకొంటుంది.