హోబర్ట్: టీ20 ప్రపంచకప్లో వెస్టిండీస్లో రేసులో నిలిచింది. బుధవారం జింబాబ్వేతో జరిగిన లీగ్ మ్యాచ్లో విండీస్ 31 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కరీబియన్లు నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యఛేదనలో అల్జరీ జోసెఫ్(4-0-16-4) విజృంభణతో జింబాబ్వే 18.2 ఓవర్లలో 122 పరుగులకు పరిమితమైంది. జోసెఫ్కు తోడు జాసన్ హోల్డర్(3/12) రాణించడంతో జింబాబ్వే బ్యాటర్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు.
తొలుత జాన్సన్ చార్లెస్(45), రోవ్మన్ పావెల్(28) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 153/7 స్కోరు చేసింది. నాలుగు వికెట్లతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన జోసెఫ్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. మరోమ్యాచ్లో స్కాట్లాండ్పై ఐర్లాండ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట స్కాట్లాండ్ 20 ఓవర్లలో 176/5 స్కోరు చేసింది. తర్వాత లక్ష్యఛేదనలో ఐర్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది.