న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ అనారోగ్యం బారినపడ్డారు. దాంతో కుటుంబసభ్యులు ఈ మధ్యాహ్నం మూడు గంటలకు ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఎయిమ్స్లోని ప్రైవేటు వార్డులో ఆయన చికిత్స పొందుతున్నారు. ఇటీవల ధన్కర్కు తీవ్ర జ్వరం రావడంతో రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు మలేరియా సోకినట్లు తేలడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఎయిమ్స్లోని మెడికల్ డిపార్టుమెంట్ అదనపు ప్రొఫెసర్ డాక్టర్ నిశ్చల్ పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారు.