కోల్కతా: పశ్చిమబెంగాల్లో ఎనిమిది విడుతల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ తొలి విడుత ఎన్నికల పోలింగ్ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఆ రాష్ట్రంలోని కోంటై అసెంబ్లీ నియోజకవర్గంలోని మూడు పోలింగ్ బూత్ల పరిధిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నంది. బీజేపీ కీలక నేత సువేందు అధికారి సోదరుడైన సౌమెందు అధికారి కారును దుండగులు అడ్డగించి ధ్వంసం చేశారు. కారు డ్రైవర్పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సౌమెందు అధికారికి ఎలాంటి గాయాలు కాలేదు.
కాగా, స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నాయకుడే ఈ దాడి చేయించాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఎంసీ బ్లాక్ అధ్యక్షుడు రామ్ గోవింద్ దాస్, ఆయన భార్య మనుషులే తనపై దాడికి పాల్పడ్డారని సౌమెందు అధికారి విమర్శించారు. మొత్తం మూడు పోలింగ్ బూత్ల పరిధిలో వాళ్లు రిగ్గింగ్కు పాల్పడుతున్నారని, అందుకే తాను అక్కడికి వెళ్లగానే వారి పనికి అడ్డు తగులుతానని నా కారును ధ్వంసం చేశారని, డ్రైవర్ను కొట్టారని సౌమెందు ఆరోపించారు.