మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడినైన తనకు ద్విదశాబ్ది పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వందన సమర్పణ చేసే అవకాశం కల్పించడం ఆనందంగా ఉన్నదని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమకారుడిగా, టీఆర్ఎస్ కార్యకర్తగా, ప్రభుత్వంలో భాగస్వామిగా ఈ అద్భుత అవకాశం పొందినందుకు గర్వపడుతున్నానని చెప్పారు. తొమ్మిదోసారి పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన అధినేత కేసీఆర్ తనకు దైవసమానులని తెలిపారు. సీఎం కేసీఆర్కు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కుటుంబసభ్యుల పక్షాన అభినందలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.