సూర్యాపేట : ఎమ్మార్పీ, సరైన పత్రాలు, కొలతల్లో అవకతవకలు పాల్పడితే ఉపేక్షించేది లేదని తూనికలు, కొలతల శాఖ అధికారి కందగట్ల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పలు మందులు, వ్యాపార దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మందుల దుకాణాల్లో సర్జికల్ కు సంబంధించిన వాటిపై ఎమ్మార్పీ లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు వివరాలను వెల్లడించారు.
కొలతలు, కాలర్ సరిగా లేకపోయినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరు మానవత్వంతో పని చేయాలని కోరారు. ఒక పక్క కరోనాతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంటే.. కొంతమంది వ్యాపారులు ఇదే అదునుగా భావించి ఇష్టానుసారంగా అవకతవకలకు పాల్పడుతున్నారు.
అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ఆయనతోపాటు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
అత్తను కర్రతో కొట్టి చంపిన అల్లుడు
ఈ పాస్ ఉంటేనే అనుమతి : డీఐజీ రంగనాధ్
ప్రజల ప్రాణాలు కాపాడటం మన బాధ్యత : మంత్రి నిరంజన్ రెడ్డి
రూ.22 కోట్ల ఫండ్ రేజ్ చేసిన ప్రియాంక-నిక్ దంపతు